ఆంథోని వాన్ లీవెన్హుక్
From Wikipedia, the free encyclopedia
ఆంథోని వాన్ లీవెన్హుక్ (అక్టోబరు 24, 1632 - ఆగస్టు 26, 1723) డచ్ దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త. ఈయనను సూక్ష్మజీవ శాస్త్రానికి ఆద్యుడిగా (the Father of Microbiology) భావిస్తారు.
ఆంథోని వాన్ లీవెన్హుక్ | |
---|---|
జననం | (1632-10-24)1632 అక్టోబరు 24 డెల్ఫ్ట్, డచ్ గణతంత్ర రాజ్యం |
మరణం | 1723 ఆగస్టు 26(1723-08-26) (వయసు 90) డెల్ఫ్ట్, డచ్ గణతంత్ర రాజ్యం |
రంగములు |
|
ప్రసిద్ధి |
|
సంతకం |
డచ్ గణతంత్రరాజ్యంలోని డెల్ఫ్ట్ లో జన్మించిన లీవెన్హుక్ యవ్వనంలో ఒక వస్త్రవ్యాపారిగా పనిచేశాడు. 1654లో స్వంతంగా దుకాణం ఏర్పాటు చేశాడు. ప్రాంతీయ మునిసిపల్ రాజకీయాల్లో గుర్తింపు సాధించాడు. కటకాల (లెన్స్) తయారీలో ఆసక్తి పెంచుకున్నాడు. 1670వ దశకంలో సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవుల మీద అధ్యయనం చేయడం ప్రారంభించాడు.
తానే స్వయంగా రూపొందించిన ఏకకటక (సింగిల్ లెన్స్) సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవుల మీద ప్రయోగాలు సాధించిన మొట్టమొదటి వాడయ్యాడు. వాటి సాపేక్ష పరిమాణాన్ని అంచనా వేసిన వారిలో కూడా ఈయనే ప్రథముడు. ఈయన పరిశీలించిన వాటిలో ఎక్కువ భాగం ఏకకణ జీవులు. ఇంకా సరస్సుల్లో జలాల నుంచి కొన్ని బహుకణ జీవులను కూడా కనుగొన్నాడు. కండర కణజాలం, బ్యాక్టీరియా, ఎర్ర రక్త కణాలు, స్ఫటికాలు కు సంబంధించి సూక్ష్మ పరిశీలనలను పొందుపరిచాడు. ఈయన ఎటువంటి పుస్తకాలు రాయకపోయినా రాయల్ సొసైటీకి రాసిన అవ్యవస్థిత లేఖల్లో ఆయన కనుగొన్న విషయాలను వర్ణించాడు. రాయల్ సొసైటీ ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా వీటిని ప్రచురించింది.