ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్
From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ( IOM ) అనేది బ్రిటిష్ భారతదేశంలో సైనిక, పౌర పురస్కారం. దీన్ని 1837 లో నెలకొల్పారు. (జనరల్ ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా, నం. 94, 1837 మే 1) [1] 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీన్ని నిలిపివేసారు. 1954 లో ప్రత్యేక భారతీయ పురస్కారాలను నెలకొల్పారు. సుదీర్ఘకాలం పాటు IOM అనేది బ్రిటిష్ భారతీయ సైన్యానికి చెందిన భారతీయులు అందుకున్న అత్యున్నత పురస్కారం. మొదట్లో దీనికి మూడు విభాగాలు ఉండేవి. 1911 లో విక్టోరియా క్రాస్ కోసం భారతీయ సైనికులు అర్హత పొందినప్పుడు దీన్ని మార్చారు. IOM యొక్క 1902 - 1939 మధ్య ఒక పౌర పురస్కారం కూడా ఇందులో ఉండేది. అయితే, దాన్ని చాలా అరుదుగా మాత్రమే ప్రదానం చేసేవారు.
త్వరిత వాస్తవాలు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, Awarded by బ్రిటిషు రాచరికం ...
మూసివేయి