సీతాకాంత్ మహాపాత్ర
ఒడిస్సా రచయిత / From Wikipedia, the free encyclopedia
సీతాకాంత్ మహాపాత్ర (జననం సెప్టెంబరు 17, 1937) ప్రసిద్ధ భారతీయ కవి, సాహిత్య విమర్శకుడు. ఆయన ఒరియా భాషలోనే కాకుండా ఆంగ్ల భాషలో కూడా రచనలు చేసారు.[1][2] ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐ.ఎ.ఎస్) గా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఆయన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కు చైర్మన్ గా కూడా పదవి నిర్వహిస్తున్నారు.
సీతాకాంత్ మహాపాత్ర | |
---|---|
జననం | (1937-09-17) 1937 సెప్టెంబరు 17 (వయసు 86) Mahanga, Cuttack, Odisha |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రచయియత,సాహిత్య విమర్శకుడు, ఉన్నతాధికారి |
గుర్తించదగిన సేవలు | సబ్దర్ ఆకాశ్ (ఆకాశం యొక్క పదాలు) (1971) సముద్ర (1977) |
ఆయన 15 కవిత్వ సమాహారాలు, 5 వ్యాస సమాహారాలు, ఒక యాత్రా చరిత్ర, 30 ఆలోచనాత్మక రచనలు, యివికాకుండా అనేక అనువాదాలను ప్రచురించారు. ఆయన కవిత్వ సమాహారం వివిధ భారతీయ భాషలలో ప్రచురితమయ్యాయి. ఆయన ప్రసిద్ధ సాహితీ సేవలు "సబ్బర్ ఆకాశ్" (1971) (ఆకాశ పదాలు), "సముద్ర" (1977), "అనేక్ శరత్" (1981) [3][4][5]
ఆయనకు 1974 లో సాహిత్య అకాడమీ అవార్డు ఒరియా భాషలో తన "సబ్దర్ ఆకాశ్"కు వచ్చింది.[6] ఆయన భారతీయ సాహిత్యానికి చేసిన అపూర్వ సేవలకు జ్ఞానపీఠ అవార్డును పొందారు. ఆయనకు 2002 లో పద్మభూషణ , 2011 లో పద్మ విభూషణ అవార్డులు వచ్చాయి. అవే కాకుండా సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, కబీర్ సమ్మాన్ , అనేక యితర ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయి.[3]