అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. ఇది జాతీయ అండర్-19 జట్లచే పోటీ చేయబడుతుంది. యూత్ క్రికెట్ ప్రపంచ కప్గా 1988లో మొదటిసారి నిర్వహించగా 1998 వరకు మళ్లీ నిర్వహించలేదు. అప్పటి నుండి ఈ టోర్నమెంట్ ప్రతి రెండేళ్లకు నిర్వహించబడుతుంది, ఈ టోర్నమెంట్ ను భారతదేశం రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచ కప్ను గెలుచుకోగా, ఆస్ట్రేలియా నాలుగు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒక్కోసారి గెలిచాయి.