అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన
పాక్ నిఘా విమానాన్ని భారత్ కూల్చివేసిన ఘటన / From Wikipedia, the free encyclopedia
పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్ విమానాన్ని భారత వాయుసేన విమానాలు కూల్చివేసిన ఘటనే అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన. 1999 ఆగస్టు 10 న 16 మంది ప్రయాణీకులతో కూడిన పాకిస్తాన్ వాయుసేనకు చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ గస్తీ విమానం భారత గగనతలాన్ని అతిక్రమించగా, భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానాలు దాన్ని కూల్చివేసాయి. కార్గిల్ యుద్ధం ముగిసిన నెలలోపే జరిగిన ఈ సంఘటన అప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రెండు దేశాల సంబంధాలను మరింత తీవ్రతరం చేసాయి.
అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన | |||||||
---|---|---|---|---|---|---|---|
భారత పాకిస్తాన్ యుద్ధాలు, ఘర్షణలులో భాగము | |||||||
పాకిస్తాన్ నేవీ వారి అట్లాంటిక్ విమానం | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
భారతదేశం | పాకిస్తాన్ | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
అటల్ బిహారీ వాజపేయీ భారత ప్రధానమంత్రి ఎయిర్ ఛీఫ్ మార్షల్ అనిల్ టిప్నిస్ వాయుసేన ప్రధానాధికారి | నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అడ్మిరల్ ఫసీ బొఖారి నౌకాదళ ప్రధానాధికారి | ||||||
బలం | |||||||
2 మిగ్-21 విమానాలు | 1 అట్లాంటిక్-91 విమానం | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
లేరు | 5 గురు అధికారులు, 11 మంది నావికులు మరణించారు |
పాకిస్తాన్ సైన్యం, తమ దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలను సంఘటన స్థలానికి తీసుకువెళ్ళి చూపించింది. ఆ విమానం సరిహద్దును అతిక్రమించి ఉండొచ్చని దౌత్యవేత్తలు భావించారు. భారత ప్రతిచర్య సమర్థనీయం కాదని కూడా వాళ్ళు భావించారు.[1]
తరువాత పాకిస్తాన్ ఈ సంఘటనను అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్ళి, భారత్ నుండి నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసును విచారించే అధికార పరిధి తమకు లేదని చెబుతూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.[2][3][4]