ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
From Wikipedia, the free encyclopedia
ఈయెమ్మెస్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్, (1909 జూన్ 13 – 1998 మార్చి 19), భారత దేశ చరిత్ర లోనే చెప్పుకోదగ్గ గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, సాంఘిక-మార్క్స్ వాద సూత్ర బద్ధుడు, విప్లవవాది, రచయిత, చరిత్రకారుడు, సాంఘిక విమర్శకుడే కాక, కేరళ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్య మంత్రి కూడాను. కాంగ్రెస్ పార్టీ బయటివాడైన ముఖ్యమంత్రిగా భారత దేశములో ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వ నాయకుడీయన.
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ | |||
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ | |||
Chief Minister of Kerala | |||
పదవీ కాలం 5 ఏప్రెల్ 1957 – 31 జులై 1959 | |||
పదవీ కాలం 6 మార్చి 1967 – 1 నవంబరు 1969 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | మూస:పుట్టిన రోజు పెరిందాళ్ మన్న, మలప్పురం, మద్రాస్ ప్రాంతం, బ్రిటిష్ ఇండియా | ||
మరణం | 1998 మార్చి 19(1998-03-19) (వయసు 88) తిరువనంతపురం, కేరళ, ఇండియా | ||
రాజకీయ పార్టీ | సిపిఎమ్ | ||
జీవిత భాగస్వామి | ఆర్యా అంతర్జనం | ||
సంతానం | ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు. | ||
నివాసం | A house rented for him by the Communist party in Kerala's capital, Thiruvanthapuram | ||
మతం | నాస్తికుడు |
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ కేరళలో శ్రీకారం చుట్టిన మౌలికమైన భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలను అనుకరించే ప్రయత్నాలు ఈ నాటికి ఇతర భారతీయ రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. మార్క్స్ వాద కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణా సమితి సభ్యుడిగా, 14 యేళ్ళ పాటు ప్రధాన కార్యదర్శిగా ఈయన తీసుకున్న చొరవ, ముందుచూపు గల నిర్ణయాలవలనే ఆ పార్టీ ఈనాడు జాతీయ స్థాయి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలను ప్రాభావితం చేయగలిగే ప్రముఖమైన రాజకీయ పక్షంగా ఎదిగిందనడంలో అతియోశక్తి లేదు.