జలంధర్
పంజాబ్ లోని నగరం / From Wikipedia, the free encyclopedia
జలంధర్ పంజాబ్ రాష్ట్రంలోని నగరం. దీన్ని బ్రిటిష్ వాళ్ళు జల్లందర్ అని పిలిచేవారు.[1] జలంధర్ నుండి ఇతర ప్రదేశాలకు చక్కటి రోడ్డు రైలు సౌకర్యాలున్నాయి. జలంధర్ చండీగఢ్ నుండి వాయవ్యంగా 146 కి.మీ.[2] దూరం లోను, అమృత్సర్ నుండి ఆగ్నేయంగా 82.5 కిమీ దూరం లోనూ ఉంది.
జలంధర్
జల్లందర్ | |
---|---|
నగరం | |
Coordinates: 31.2569°N 75.4432°E / 31.2569; 75.4432 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | జలంధర్ |
Elevation | 228 మీ (748 అ.) |
Population (2011) | |
• Total | 8,62,196 |
Demonym | జలంధరియే |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 144 001 |
టెలిఫోన్ కోడ్ | +91-181-XXX XXXX |
Vehicle registration | PB08 and PB90 |
అక్షరాస్యత | 82.3% |
జలంధర్ జిల్లా చరిత్ర పురాతన, మధ్యయుగ, ఆధునిక మూడు కాలాలను కలిగి ఉంది.
పురాణాలు, మహాభారతాలలో కనిపించే రాక్షస రాజు జలంధరుడి పేరిట నగరానికి పేరు వచ్చి ఉండవచ్చు. వేదాలలో పేర్కొన్న ప్రకార్ం చూస్తే జలంధర్ నగరాన్ని దేవస్య వర్మ స్థాపించాడు. ఇది రాముడి కుమారుడైన లవుడి రాజ్యానికి రాజధాని అని కూడా ప్రతీతి.
నీటితో పరివేష్ఠితమైన భూమి అనీ జలంధరకు అర్థం. సత్లజ్, బియాస్ అనే రెండు నదుల మధ్య ఉన్న భూమి కాబట్టి ఈ నగరానికి ఈ పేరు వచ్చి ఉండవచ్చు.[3] ప్రస్తుత జలంధర్ జిల్లా ప్రాంతం సింధు లోయ నాగరికతలో భాగం.
గజ్నవీడుల హయాంలో, 1058, 1089 ల మధ్య, ఇబ్రహీం ఘజనీ జలంధర్ను ఆక్రమించాడు [4] ఇది తరువాత ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ సామ్రాజ్యాల్లో లాహోర్ ప్రావిన్స్లో భాగమైంది. 18 వ శతాబ్దం మొఘలుల విచ్ఛిన్నం తరువాత పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలతో ఏర్పడిన అరాచకం మధ్య జలంధర్ ఆటుపోట్లకు గురైంది. 1766 లో దీనిని ఫైజుల్లాపూరియా మిస్ల్ స్వాధీనం చేసుకున్నాడు. 1811 లో రంజిత్ సింగ్ దీనిని సిక్కు సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు.[5]
1849 లో, ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను స్వాధీనం చేసుకున్న తరువాత, జలంధర్ నగరం అదే పేరుతో ఉన్న డివిజనుకు, జిల్లాకూ ముఖ్య పట్టణమైంది. 19 వ శతాబ్దం మధ్యలో, జలంధర్ ప్రజలతో క్రిక్కిరిసి పోయిందని భావించారు. ఇక్కడి నుండి ప్రజలను కొత్తగా కాలువ నీటి సౌకర్యం ఏర్పడిన ఇతర ప్రాంతాలకు తరలించారు [6]
టర్కీ పట్ల తమ విధానాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 1920 ప్రారంభంలో ఖిలాఫత్ ఉద్యమం జిల్లాలో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ ఈ ఉద్యమానికి సానుభూతి, మద్దతును అందించాడు. అయితే ప్రతిస్పందనగా జిల్లాను దేశద్రోహ సమావేశాల చట్టం ప్రకారం 'ప్రకటించిన ప్రాంతం' గా గుర్తించారు.