టర్కీ
ఆగ్నేయ తూర్పు ఐరోపా మరియు పాశ్చాత్య ఆసియా దేశాల దేశము / From Wikipedia, the free encyclopedia
"Turkish Jews – Brief History". science.co.il.
టర్కీ (Turkish: Türkiye), అధికారికంగా టర్కీ గణతణత్రం (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా, రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయవ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్బైజాన్, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము, సైప్రస్, ఏగియన్ సముద్రము, ద్వీపసమూహములు పశ్చిమాన, ఉత్తరాన నల్ల సముద్రము గలవు.
రెండు ఖండాలైన ఆసియా, ఐరోపా ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది. టర్కీ ప్రజాస్వామిక, సెక్యులర్, యూనిటరి, రాజ్యాంగ గణతంత్రంగా ప్రకటించుకుంది, దీని రాజకీయ విధానము 1923 లో ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. అప్పటి నుండి టర్కీ పశ్చిమదేశాలతో సన్నిహితంగానూ, తూర్పుదేశాలతో మౌనంగానూ వుంటూ వస్తూంది. టర్కీ పై కూడా ఇతర పశ్చిమ దేశాల వలె మానవ హక్కుల ఉల్లంఘనల పైన విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు టర్కీలో కుర్దులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అనేక కుర్దు జాతీయ సంస్థలు విమర్శిస్తున్నాయి.
టర్కీ ప్రాంతంలో పాలియో లిథిక్ కాలం నుండి మానవనివాసాలు ఉన్నాయి.[1] ఈ ప్రాంతం పురాతన అనటోలియన్లు, అస్సిరియన్లు, గ్రీకులు, థ్రాసియన్లు, ఫ్రిజియన్లు, ఉరాటియన్లు, ఆర్మేనియన్లు నివసించారు. [2][3][4] అలెగ్జాండర్ మాహావీరుడు ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత ఈ ప్రాంతం హెలెనైజేషన్ చేయబడి రోమన్ సామ్రాజ్యంలో భాగం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం బైజాంటైన్ సామ్రాజ్యంలో భాగం అయింది.[3][5] 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి సెల్జుక్ టర్కీలు వలస వచ్చారు. తరువాత ఈ ప్రాంతంలో టర్కిఫికేషన్ ఆరంభం అయింది. 1071లో " బాటిల్ ఆఫ్ మాంజికర్ట్ " యుద్ధంలో సెల్జుక్ టర్కీలు బైజాటైనుల మీద విజయం సాధించిన తరువాత టర్కీల ఆధిక్యత స్థిరపడింది.[6] మంగోలియన్లు అనటోలియా మీద విజయం సాధించే వరకు అనటోలియాను " సెల్జుక్ సుల్తానేట్ ఆఫ్ రుం " పాలించింది.[7] 14 వ శతాబ్దం మద్యకాలానికి ఓట్టమన్లు అనటోలియాను సమైక్యం చేస్తూ ఆగ్నేయ ఐరోపా, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను కలుపుకుని సామ్రాజ్యం ఏర్పాటు చేసి ఆధునిక కాలం ఆరంభంలో ఆఫ్రికా, యురేషియాలో ప్రాధానశక్తిగా మారారు. 16 వ శతాబ్దంలో ప్రత్యేకంగా సులేమాన్ ది మెగ్నిఫిసెంట్ (1520 - 1566) కాలంలో సామ్రాజ్యం అత్యున్నత స్థానం చేరుకుంది.1683లో వియన్నాల్ సెకండ్ ఓట్టమన్ సైజ్ ఆఫ్ వియన్నా, 1699 గ్రేట్ టర్కిష్ యుద్ధం తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం దీర్ఘపతనం మొదలైంది. 19వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యం ఆధినికీకరణలో భాగంగా తాంజిమత్ సంస్కరణలు ఆరభించారు. సంస్కరణలు ఓట్టమన్ సామ్రాజ్యం పతనం నుండి రక్షించడంలో విఫలం అయ్యాయి.[8]
1878లో రెండవ సుల్తాన్ అద్బుల్ హమీద్ " ఫస్ట్ కాంసిట్యూషనల్ ఎరా ", ఓట్టమన్ కాంసిట్యూషన్ (1876), జనరల్ శాసనసభ ఆఫ్ ది ఓట్టమన్ ఎంపైర్, సెకండ్ కాంసిట్యూషనల్ ఎరా, యంగ్ టర్క్ రివల్యూషన్ 1908 మొదలైన సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. అయినప్పటికీ 1913 ఓట్టమన్ తిరుగుబాటు దేశాన్ని తీవ్రంగా కదిలించింది.తరువాత ఓట్టమన్ ముగ్గురు పషాస్ నియంత్రణలోకి మారింది. ఓట్టమన్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించడానికి తీసుకున్న నిర్ణయంలో వీరు ప్రధానపాత్ర వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో (1914- 1918) ఓట్టమన్ సెంట్రల్ పవర్ పక్షంలో చేరింది. యుద్ధంలో సెంట్రల్ పవర్ అలైస్ ఆఫ్ వరల్డ్ వార్ || చేతిలో ఓటమిచవి చూసింది.
రెండవప్రపంచ యుద్ధం సమయంలో ఓట్టమన్ ప్రభుత్వం అమెరికన్ సంతతి, అస్సిరియన్ సంతతి, గ్రీక్ సంతతి ప్రజలకు వ్యతిరేకంగా సంప్రదాయ పరంగా జాతిహత్యలకు పూనుకున్నది. మరొకవైపు ఓట్టమన్ ముస్లిములు (ప్రత్యేకంగా టర్కీ ప్రజలు) పరిసర రాజ్యాలలో జాతి హత్యలకు గురయ్యారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో టర్కీ ముస్లిములు అనటోలియాకు తరలి వచ్చారు.[9] యుద్ధానంతరం ఓట్టమన్ సామ్రాజ్యం పలు చిన్న రాజ్యాలుగా విడిపోయాయి.[10]
ముస్తాఫా కెమల్, అతని సహచరులు కలిసి అనటోలియాలో అటాతక్ టర్కీ స్వతంత్ర పోరాటం (1919 - 1922) ఆరంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ దళాల ఆక్రమణకు వ్యతిరేకగా స్వతంత్ర పోరాటం ప్రారంభం అయింది. ఫలితంగా 1922లో సుల్తానేట్ తొలగించబడి 1923లో " రిపబ్లిక్ ఆఫ్ టర్కీ " స్థాపించబడింది. టర్కీ సామ్రాజ్యానికి అటాతుక్ మొదటి అధ్యక్షుడయ్యాడు.[11] టర్కీ అధికారిక భాష టర్కిష్. టర్కిష్ భాషను దేశంలో 84.5% ప్రజలకు వాడుక భాషగా ఉంది.[12] 78.1%, 81.3% పౌరులు తమను టర్కిష్ ప్రజలుగా నమోదుచేసుకున్నారు.[12] టర్కీలో ఆర్మేనియన్లు, గ్రీకులు, యూదులు, కుర్ధీలు, సర్కాసియన్లు, అరబ్స్, అల్బేనియన్లు, బోస్నియాకులు, జార్జియన్లు అల్పసంఖ్యాకులుగా చట్టబద్ధంగా నమోదుచేయబడ్డారు.[12] అల్పసంఖ్యాకులలో కుర్ధీలు అధికంగా ఉన్నారు.[13][14] దేశంలో అత్యధికంగా సున్నీ ముస్లిము, అలెవిసులతో కలిసి సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్నారు.[13] టర్కీ యునైటెడ్ నేషంస్ చార్టర్ సభ్యత్వం కలిగి ఉంది, నాటో ఆరంభ సభ్యత్వం కలిగి ఉంది, " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో- ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంట్ (ఒ.ఇ.సి.డి), ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్ (ఒ.ఎస్.సి.ఇ), ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఒ.ఐ.సి) , జి 20 లలో ఫండింగ్ మెంబర్గా ఉంది.1949 లో " మెంబర్ స్టేట్స్ ఆఫ్ ది కౌంసిల్ ఆఫ్ ఐరోపా " సభ్యత్వం పొందిన తరువాత టర్కీ 1963 లో " యురేపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ అసోసియేట్ సభ్యత్వం పొందింది. 1987లో పూర్తి స్థాయి ఇ.ఇ.సి. సభ్యత్వం కొరకు అభ్యర్థించింది. 1995లో " టర్కీ యురేపియన్ యూనియన్ కస్టంస్ యూనియన్ " చేరింది. 2005 లో యురేరియన్ యూనియన్తో కలిసి " అసోసియేషన్ నెగోషియేషన్ " స్థాపించింది.[15] అభివృద్ధి చెందిన ఆర్థికాభివృద్ధి, దౌత్య సంబంధాలు టర్కీని రీజనల్ పవర్గా మార్చింది.[16][17][18][19]