నాన్కానా నరమేధం
From Wikipedia, the free encyclopedia
నాన్కానా నరమేధం (లేక సాకా నాన్కానా) అన్నది బ్రిటీష్ ఇండియాలో ప్రస్తుతం పాకిస్తానీ పంజాబ్ ప్రాంతంలోని నాన్కానా సాహిబ్ ప్రాంతంలో జరిగిన నరమేధం.[1] ఈ సంఘటన సిక్ఖుల చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది. రాజకీయ ప్రాధాన్యతలో ఇది జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత స్థానాన్ని పొందుతుంది. 20వ శతాబ్దిలో గురుద్వారా సంస్కరణ ఉద్యమం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న సిక్ఖు నిరసనకారులపై దారుణమైన దాడులు చేసి, అనేకమంది మరణానికి కారణమయ్యారు. మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా ఈ సంఘటన సందర్భంగా సిక్ఖులు కనబరిచిన స్వయం నియంత్రణ, ఆత్మశక్తి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.[2]