భారత-పాకిస్తాన్ సరిహద్దు
From Wikipedia, the free encyclopedia
భారత-పాకిస్తాన్ సరిహద్దు, భారతదేశం, పాకిస్తాన్లను వేరుచేసే అంతర్జాతీయ సరిహద్దు. ఈ సరిహద్దుకు ఉత్తర కొసన నియంత్రణ రేఖ ఉంది. ఇది కాశ్మీర్ను పాక ఆక్రమిత కాశ్మీర్ నుండి వేరు చేస్తుంది. సరిహద్దుకు దక్షిణ చివరలో సర్ క్రీక్ ఉంది, ఇది గుజరాత్ రాష్ట్రానికి, పాకిస్తానీ రాష్ట్రమైన సింధ్ కు మధ్య రాన్ ఆఫ్ కచ్లోని ఒక ఉప్పు కయ్య. [1]
భారత-పాకిస్తాన్ సరిహద్దు | |
---|---|
లక్షణాలు | |
పక్షాలు | India Pakistan |
పొడవు | 3,323 kilometres (2,065 mi) |
History | |
ఏర్పాటు | 1947 ఆగస్టు 17 భారతదేశ విభజన లో భాగంగా సిరిల్ రాడ్క్లిఫ్ సృష్టించిన రాడ్క్లిఫ్ రేఖ |
ప్రస్తుత రూపు | 1972 జూలై 2 సిమ్లా ఒడంబడిక లో అంగీకరించిన విధంగా నియంత్రణ రేఖ గుర్తింపు |
ఒడంబడికలు | కరాచీ ఒప్పందం (1949), సిమ్లా ఒడంబడిక (1972) |
గమనికలు | నియంత్రణ రేఖ కాశ్మీరును, పాక్ ఆక్రమిత కాశ్మీరును విభజిస్తూ సాగుతుంది. కాశ్మీరు సమస్య కారణంగా అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులో భాగం కాదు. |
తొలుత 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో రాడ్క్లిఫ్ లైన్ ఆధారంగా ఈ సరిహద్దును గుర్తించారు. ఈ సరిహద్దు, ప్రధానమైన పట్టణ ప్రాంతాల నుండి నిర్జనమైన ఎడారుల వరకు అనేక రకాల భూభాగాల గుండా వెళుతుంది. [2] రెండు దేశాలకూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొద్దికాలానికే భారతదేశం-పాకిస్తాన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ఇది అనేక సరిహద్దు సైనిక ప్రతిష్టంభనలకు, పూర్తి స్థాయి యుద్ధాలకూ వేదికగా నిలిచింది. [2] PBS ఇచ్చిన గణాంకాల ప్రకారం, ఈ సరిహద్దు మొత్తం పొడవు 3,323 kilometres (2,065 mi). [2] [3] 2011లో ఫారిన్ పాలసీ పత్రికలో రాసిన ఒక కథనం ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ సరిహద్దులలో ఇది ఒకటి. భారతదేశం ఈ సరిహద్దు వెంట సుమారు 50,000 దీప స్తంభాలపై 1క్వ్వ్,50,000 ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేసింది. ఈ కారణంగా రాత్రి సమయంలో, భారత-పాకిస్తాన్ సరిహద్దు అంతరిక్షం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. [4] [5]