మాఘీ
From Wikipedia, the free encyclopedia
మాఘీ, మకరసంక్రాంతికి పంజాబీ రూపం. శీతాకాలంలో భారతదేశం మొత్తం మీద జరుపుకునే మకరసంక్రాంతిని వీరు మాఘీ పేరుతో చేసుకుంటారు.[1] పంజాబీ పంచాంగం ప్రకారం వచ్చే మాఘ మాస మొదటి రోజును మాఘీగా జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ప్రజలు చేసుకుంటారు. సంప్రదాయంగా, కాలానుసారంగా, ఆధ్యాత్మికంగా పంజాబీలకు ప్రత్యేకమైన పండుగ ఇది. వ్యవసాయ నూతన సంవత్సరంగా జరుపుకునే ఈ పండుగలో ఆటపాటలకు విశేష ప్రముఖ్యత ఉంటుంది.