సుమేరు నాగరికత
దక్షిణ మెసొపొటేమియా లోని పురాతన నాగరికత / From Wikipedia, the free encyclopedia
సుమేరు నాగరికత తామ్ర శిలా యుగం, మొదటి కంచు యుగ కాలాల్లో, సుమారు క్రీ.పూ. 5–6 సహస్రాబ్దుల్లో, దక్షిణ మిసొపొటేమ్యా (ఆధునిక దక్షిణ-మధ్య ఇరాక్) ప్రాంతములో మొదలైంది. ఇది మెసొపొటేమియాలోని నాగరికతల్లో మొదటిది. సింధూ నాగరికత, ప్రాచీన ఈజిప్టు, ఈలము, ప్రాచీన చైనా, కారలు నాగరికత, ఒల్మెక్ నాగరికతలతో పాటు ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికతలలో ఇది కూడా ఒకటి. టైగ్రిసూ, యూఫ్రెటీసు లోయలలో నివసించిన సుమేరు రైతులు ధాన్యం, ఇతర పంటలను విస్తారంగా సాగుచేసారు. ఆ పంట మిగులు వారు పట్టణావాసాలు ఏర్పరిచేందుకు దోహదపడింది. క్రీ.పూ 3000 నాటికీ ఆదిలేఖన పద్ధతులు ఈ నాగరికతలో కనిపిస్తాయి. ఈ నాగరికత యొక్క అత్యంత పురాతన రచనలు ఉరుక్, జెమ్డెట్ నస్ఱ్ నగరాలలో లభించాయి. ఇవీ క్రీ.పూ 3500–3000 నాటివి.
త్వరిత వాస్తవాలు భౌగోళిక పరిధి, కాలం ...
భౌగోళిక పరిధి | మెసొపొటేమ్యా, నియర్ ఈస్ట్, మధ్యప్రాచ్యం |
---|---|
కాలం | నవీన శిలా యుగ ద్వితియార్ధం, కంచుయుగం |
తేదీలు | సుమారు క్రీ.పూ. 4500 – 1900 |
దీనికి ముందు | ఉబైడు కాలం |
దీని తరువాత | అకేడు సామ్రాజ్యం |
మూసివేయి