హవా మహల్
From Wikipedia, the free encyclopedia
హవా మహల్ (ఆంగ్ల అనువాదం: "ది ప్యాలెస్ ఆఫ్ విండ్స్" లేదా "ది ప్యాలెస్ ఆఫ్ బ్రీజ్") భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లోని ఒక ప్యాలెస్. ఎరుపు, గులాబీ రాయితో తయారైన ఈ ప్యాలెస్ జైపూర్ లోని సిటీ ప్యాలెస్ అంచున ఉంది. ఇది జెనానా వరకు విస్తరించి ఉంది.
హవా మహల్ | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ శైలి | రాజపుత్ నిర్మాణశైలి |
దేశం | భారతదేశం |
భౌగోళికాంశాలు | 26.9239°N 75.8267°E / 26.9239; 75.8267 |
పూర్తి చేయబడినది | 1799 |
సాంకేతిక విషయములు | |
నిర్మాణ వ్యవస్థ | Red and pink delivered sandstone |
రూపకల్పన, నిర్మాణం | |
ప్రధాన కాంట్రాక్టర్ | మహారాజ ప్రతాప్ సింగ్ |
ఈ నిర్మాణాన్ని 1799 లో జైపూర్ స్థాపకుడైన మహారాజా సవాయి జై సింగ్ మనవడు మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించాడు. ఖేత్రి మహల్ ప్రత్యేకమైన నిర్మాణంతో అతను ఎంతో ప్రేరణ పొందిన అతను ఈ గొప్ప, చారిత్రక రాజభవనాన్ని నిర్మించాడు. దీనిని లాల్ చంద్ ఉస్తాద్ రూపొందించాడు. దీని ప్రత్యేకమైన ఐదు అంతస్తుల వెలుపలి భాగం తేనెటీగ యొక్క తేనెగూడుతో సమానంగా ఉంటుంది. దీనిని శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంట పడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి[1]. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది కాబట్టి దీనికా పేరు వచ్చింది. ఈ కిటికీల వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో మొత్తం ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.[1][2][3] తద్వారా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో మొత్తం ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా మంది ప్రజలు హవా మహల్ ను వీధుల నుండి చూసి ఇది ప్యాలెస్ ముందు భాగం అని అనుకుంటారు, కాని వాస్తవానికి అది ఆ నిర్మాణానికి వెనుక భాగం.[4]