అయోధ్య వివాదంపై 2019 సుప్రీంకోర్టు తీర్పు
అయోధ్య వివాదంలో భారత సుప్రీంకోర్టు తుది తీర్పు / From Wikipedia, the free encyclopedia
అయోధ్య వివాదంలో తుది తీర్పును భారత సుప్రీంకోర్టు 9 నవంబర్ 2019న ప్రకటించింది. రామజన్మభూమిలో (హిందువుల ఆరాధ్య దైవం, రాముడి జన్మస్థలం) ఆలయాన్ని నిర్మించేందుకు వివాదాస్పద భూమిని (2.77 ఎకరాలు) ట్రస్టుకు (భారత ప్రభుత్వం సృష్టించే) అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదుకు బదులుగా మసీదు నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మరో స్థలంలో 5 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.[1]