2020 భారత చైనా సరిహద్దు కొట్లాటలు
భారత చైనాల మధ్య 2020 లో మొదలై 2021 లో కూడా కొనసాగిన సరిహద్దు ఘర్షణలు / From Wikipedia, the free encyclopedia
2020 భారత చైనా కొట్లాటలు, భారత చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భాగం. 2020 మే 5 నుండి, భారత, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రదేశాలలో దొమ్మీలకు, ముష్టి యుద్ధాలకూ, కొట్లాటలకూ పాల్పడ్డాయి. లడఖ్లోని వివాదాస్పదమైన పాంగోంగ్ సరస్సుకు సమీపంలోను, సిక్కింకు, టిబెట్ అటానమస్ రీజియన్ కూ మధ్య గల సరిహద్దు వద్దా ఈ కొట్లాటలు జరిగాయి. తూర్పు లడఖ్లో కూడా వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంట ఘర్షణలు జరిగాయి.
2020 భారత చైనా కొట్లాటలు | |||||
---|---|---|---|---|---|
భారత చైనా సరిహద్దు వివాదంలో భాగము | |||||
సిఐఏ వారి కాశ్మీరు మ్యాపు - కొట్లాటలు జరిగిన ప్రదేశాలను ఎర్ర వృత్తాల్లో చూపించారు. గల్వాన్ లోయ (పైన), హాట్ స్ప్రింగ్స్ చెక్ పాయింటు (మధ్య), పాంగోంగ్ త్సో (కింద). | |||||
| |||||
ప్రత్యర్థులు | |||||
India | China | ||||
సేనాపతులు, నాయకులు | |||||
రామ్నాథ్ కోవింద్ (భారత రాష్ట్రపతి) నరేంద్ర మోడీ (C.O. 16 బీహార్ రెజిమెంటు) | Xi Jinping (CCP General Secretary, PRC President and CMC Chairman)[lower-alpha 1] Li Keqiang (Premier of China) Gen. Wei Fenghe (Commander, PLA Ground Force South Xinjiang Military District)[11][3] | ||||
పాల్గొన్న దళాలు | |||||
Indian Armed Forces
Indo-Tibetan Border Police | People's Liberation Army
| ||||
బలం | |||||
60,000 (US, 11 October 2020)[12] | |||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||
మే10 న: గాయాలు 4[13] | భారతీయ వర్గాలు: మే 10 న: ఇతర వర్గాలు: |
మే చివరలో, గల్వాన్ నది లోయలో భారతదేశం చేస్తున్న రహదారి నిర్మాణం పట్ల చైనా దళాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. [26] [27] భారత వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 15/16 న జరిగిన కొట్లాట ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు (ఒక అధికారితో సహా) మరణించారు. [28] 43 మంది చైనా సైనికులు మరణించడం గాని గాయపడ్డం గానీ జరిగింది (ఒక అధికారితో కలిపి). [lower-alpha 2] [30] [31] ఇరువైపులా సైనికులను బందీలుగా పట్టుకొని, తరువాతి కొద్ది రోజుల్లో విడుదల చేసినట్లు మీడియా వార్తల్లో వచ్చాయి. భారత్ వైపు పది మంది సైనికులను బందీలుగా తీసుకున్నట్లు తెలిసింది, అయితే చైనా సంఖ్యలు ధృవీకరణ కాలేదు. [15] తరువాత, భారత సైనికులను నిర్బంధించినట్లు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం రెండూ ఖండించాయి. [32]
జూలై 25 న, గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ వద్ద కొట్లాటలు ఆగిపోయాయని వార్తలు వచ్చాయి. [33] జూలై 30 నాటికి, పాంగోంగ్ త్సో (త్సో అంటే టిబెట్ భాషలో సరస్సు అని అర్థం) వద్ద, గోగ్రాలోని పిపి 17 ఎ వద్దా కొట్లాటలు పూర్తిగా ఆగలేదు. భారత, చైనాల మధ్య "పూర్తి విరమణ" ఇంకా మిగిలే ఉంది. [34] [35] విరమణ ప్రక్రియ పూర్తి కాకపోతే శీతాకాలంలో కూడా దళాల విస్తరణను కొనసాగిస్తామని భారత సైన్యం చెప్పింది. [36] ఆగస్టు చివరలోను, సెప్టెంబరు ఆరంభంలోనూ, చుషుల్ సెక్టార్లో భారత దళాలు ఎల్ఎసి వెంట అనేక శిఖరాలను ఆక్రమించాయి. అక్కడి నుండి స్పంగ్గూర్ గ్యాప్, స్పంగ్గూర్ త్సో వద్ద ఉన్న చైనా స్థావరాలు కనిపిస్తాయి. [37] [38] సెప్టెంబరు 7 న, 45 సంవత్సరాలలో మొదటిసారి, ఎల్ఎసి వెంట కాల్పులు జరిగాయి. కాల్పులకు కారకులు మీరంటే మీరేనంటూ ఇరువర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి. [39] [40] ఆగస్టు 30 న చైనా సైన్యంపై భారత దళాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు భారత మీడియా తెలిపింది. [41]
ఓవైపు ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండగానే, భారతదేశం సుమారు 12,000 మంది కార్మికులను అదనంగా లడఖ్కు పంపి ఇక్కడి పనులను వేగవంతం చేసింది. వారు భారత చైనా సరిహద్దులో భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిని త్వరగా పూర్తి చేయడంలో భారత సరిహద్దు రహదారుల సంస్థకు సహాయపడతారు. [42] [43] [44] లడఖ్లో భారత్ నిర్మిస్తున్న డార్బుక్-ష్యోక్-డిబివో రోడ్డు నిర్మాణాన్ని ముందే అడ్డుకునే చైనా ప్రణాళికలో భాగమే ఈ ప్రతిష్ఠంభనలని నిపుణులు సిద్ధాంతీకరించారు. [45] ఈ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనీయులు కూడా తమవైపు మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. [46] [47] 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం కూడా చైనీయులను ఇబ్బంది పెట్టింది. [48] అయితే, నిశ్శబ్ద దౌత్యం ద్వారా పరిస్థితిని పరిష్కరించడానికి సరిపడినన్ని ద్వైపాక్షిక యంత్రాంగాలు తమకు ఉన్నాయని భారతదేశం, చైనా రెండూ అభిప్రాయపడ్డాయి. [49] [50] సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత చైనాల మధ్య అనేక దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరిగాయి. కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ ర్యాంకుల్లో చర్చలు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశాలు, [lower-alpha 3] [52] [53] 'భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటైన కార్యకారక మెకానిజం' (WMCC), [lower-alpha 4] [55] విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య సమావేశాలూ సమాచార మార్పిడీ మొదలైనవన్నీ ఇందులో భాగాలే. [56] సెప్టెంబరు 21 న, ఆరవ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. దాని తరువాత మరొక ఉమ్మడి ప్రకటన విడుదలైంది. [57]
జూన్ 15 న గల్వాన్ లోయ కొట్లాటల తరువాత, చైనా ఉత్పత్తులను బహిష్కరించడం గురించి భారతదేశంలో కొన్ని ప్రచారాలు జరిగినప్పటికీ సరిహద్దు ఉద్రిక్తతలు భారత చైనా వాణిజ్యాన్ని ప్రభావితం చేయవని పలువురు భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు [58] [59] అయితే, తరువాతి రోజులలో, చైనా సంస్థలతో చేసుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేయడం, కొన్నిటిపై అదనపు పరిశీలనలను విధించడంతో సహా ఆర్థిక రంగంలో వివిధ రకాల చర్యలు తీసుకున్నారు. టెలికాం వంటి వ్యూహాత్మక మార్కెట్లలో చైనీయుల ప్రవేశాన్ని ఆపడానికి కూడా పిలుపునిచ్చారు. [60] [61] [62] సరిహద్దు ఉద్రిక్తతల వలన భారత చైనాల మధ్య వాణిజ్యమేమీ "మందగించలేదని" సెప్టెంబరులో తెలిసింది. [63]