క్రీడాభిరామం
From Wikipedia, the free encyclopedia
మాచల్దేవి క్రీడాభిరామం అనునది వినుకొండ వల్లభరాయుడు మాచల్దేవి గౌరవార్థం రచించిన వీధి నాటకం. ఇది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. కాకతీయుల కాలంలో వేశ్యా కులానికి విశేష ప్రాధాన్యముండేది. వేశ్యల్ని పోషించటం ఆనాటి అధికార వర్గాల గౌరవంగా భావించేవారు. ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాచల్దేవి ఒకతె. ఈమె భవనం ఓరుగల్లులో నాటి అత్యంత సుందర భననాలలో ఒకటి. క్రీడాభిరామం రెడ్డిరాజుల కాలంలో రచించబడ్డ వీధి నాటకం. ఈ కావ్యకర్త విషయంలో సాహితీవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీనాథుడు రాశాడని కొందరు, వినుకొండ వల్లభరాయుడు రచించాడని మరికొందరు భావిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
క్రీడాభిరామం | |
కృతికర్త: | శ్రీనాథుడు/వినుకొండ వల్లభరాయుడు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | వీధి నాటకం |
ప్రచురణ: | |
విడుదల: |
మూసివేయి