ఇందిరా గాంధీ శాంతి బహుమతి
From Wikipedia, the free encyclopedia
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం తో తికమక పడకండి.
ఇందిరా గాంధీ బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి ఒక ప్రతిష్ఠాత్మక పురస్కారం. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్[1] వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి, నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.ఈ బహుమతి క్రింద 25లక్షల రూపాయలు నగదు, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ బహుమతిని ఎంపికచేసే మండలిని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ నియమిస్తుంది. ఈ ప్యానెల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ఇంత వరకు ఈ బహుమతిని స్వీకరించినవారు సభ్యులుగా ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ నామినీల నుండి బహుమతికి ఎంపిక చేస్తారు.
త్వరిత వాస్తవాలు ఇందిరా గాంధీ బహుమతి, వివరణ ...
ఇందిరా గాంధీ బహుమతి | |
---|---|
వివరణ | శాంతి కోసం విశిష్ట సేవలకు |
Location | న్యూ ఢిల్లీ |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ |
మొదటి బహుమతి | 1986 |
మూసివేయి