ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం
From Wikipedia, the free encyclopedia
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుమీద ప్రదానం చేస్తున్న ప్రతిష్ఠాత్మక పురస్కారం. 1985 నుండి ప్రతియేటా ఇందిరా గాంధీ వర్ధంతిరోజు అంటే అక్టోబర్ 31వ తేదీన ఈ పురస్కారాన్ని భారతీయ జాతి, మత, సాంస్కృతిక, భాషా, సాంప్రదాయ గుంపులతో సాంగత్యం కలిగి ఉండి, జాతి సమైక్యతను అర్థం చేసుకుని, వృద్ధి చేస్తూ, భారతీయాత్మ అయిన ఏకత్వాన్ని ఆలోచన ద్వారా, ఆచరణ ద్వారా కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు. కళ, విజ్ఞాన, సాంస్కృతిక, విద్యా, సాహిత్య, మత, సామాజిక సేవ, జర్నలిజం రంగాలలోని నిష్ణాతులు సభ్యులుగా కల సలహాసంఘం ఈ పురస్కారానికి విజేతను ఎన్నుకుంటుంది. ఏ సంవత్సరం ఈ పురస్కారానికి ఎన్నుకుంటారో ఆ ఏడాదికి వెనుక రెండు సంవత్సరాల కాలంలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పురస్కారం క్రింద 5 లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం ఇస్తారు.[1]
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం | |
---|---|
వివరణ | జాతీయ సమైక్యతకోసం కృషికి |
Location | న్యూ ఢిల్లీ |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | భారత జాతీయ కాంగ్రెస్ |
మొదటి బహుమతి | 1985 |