పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ పంజాబ్ శాఖ / From Wikipedia, the free encyclopedia
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ రాష్ట్ర శాఖ. బ్రిటిషు భారతదేశంలో దీన్ని పంజాబ్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అనేవారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడంతో పాటు, స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత. 2022 ఏప్రిల్ 9 న పంజాబ్ పిసిసి నేతగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ను కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నియమించింది.[1] ఈ పదవిని చేపట్టిన 25 వ వ్యక్తి అతను. 2021 అక్టోబరు 22 న నియమితులైన హరీష్ చౌదరి ప్రస్తుతం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, Chairperson ...
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | పర్తాప్ సింగ్ బాజ్వా |
ప్రధాన కార్యాలయం | చండీగఢ్ |
యువత విభాగం | పంజాబ్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | పంజాబ్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
కూటమి | యుపిఎ |
లోక్సభలో సీట్లు | 6 / 13
|
రాజ్యసభలో సీట్లు | 0 / 7
|
శాసనసభలో స్థానాలు | 16 / 117
|
Election symbol | |
మూసివేయి