లోక్సభ
భారతదేశం దిగువ సభ / From Wikipedia, the free encyclopedia
భారత పార్లమెంటు (హిందీ:संसद) లో దిగువ సభను లోక్సభ (ఆంగ్లం: Loksabha) అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు.[4][5] వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు.[6][7][8] లోక్సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
లోక్సభ[1] | |
---|---|
17వ లోక్సభ | |
రకం | |
రకం | భారత పార్లమెంటు దిగువ సభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకర్ | ఖాళీ 2019 భారత సార్వత్రిక ఎన్నికలు నుండి |
సభాధ్యక్షుడు | |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 545 (543 ఎన్నిక + 2 రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన ఆంగ్లో ఇండియన్లు)[3] |
రాజకీయ వర్గాలు | పాలకపక్షం (336)
ఎన్ డి ఏ (336)
ప్రతి పక్షం (207)
ఇతరులు(97)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | First past the post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 11 ఏప్రిల్ – 23 మే 2019 |
తదుపరి ఎన్నికలు | ఏప్రిల్ – మే 2024 |
నినాదం | |
धर्मचक्रपरिवर्तनाय | |
సమావేశ స్థలం | |
Lok Sabha chamber, Sansad Bhavan, Sansad Marg, New Delhi, India - 110 001 |