భారత రాష్ట్రపతుల జాబితా
1950 నుండి పనిచేసిన భారత రాష్ట్రపతులు వివరాలు / From Wikipedia, the free encyclopedia
భారత రాష్ట్రపతి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాధినేత, భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్. రాష్ట్రపతిని భారతదేశ ప్రథమ పౌరుడిగా పేర్కొంటారు.[1] [2] భారత రాజ్యాంగం ద్వారా ఈ అధికారాలు పొందబడినప్పటికీ, ఈ స్థానం చాలావరకు ఉత్సవ సంబంధమైంది. కార్యనిర్వాహక అధికారాలు వాస్తవికంగా ప్రధానమంత్రి ద్వారా ఉపయోగించబడతాయి.[3]
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
పార్లమెంటు సభలు, లోక్సభ, రాజ్యసభలలో ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు, అలాగే శాసనసభ లేదా విధానసభ, రాష్ట్ర శాసనసభల సభ్యులు కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు.[2]
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56, పార్టు V ప్రకారం, రాష్ట్రపతి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు.ప్రెసిడెంటు పదవీకాలం ముందుగానే లేదా ప్రెసిడెంటు లేని సమయంలో ముగించబడిన సందర్భంలో, వైస్ ప్రెసిడెంటు ఆ పదవిని స్వీకరిస్తారు. పార్టు Vలోని ఆర్టికల్ 70 ద్వారా, ఇది సాధ్యం కాని చోట లేదా ఏదైనా ఇతర ఊహించని ఆకస్మిక పరిస్థితుల్లో రాష్ట్రపతి విధులను ఎలా నిర్వర్తించాలో పార్లమెంటు నిర్ణయించవచ్చు
1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంతో భారతదేశం రిపబ్లిక్గా ప్రకటించబడినప్పుడు ఈ పదవిని స్థాపించినప్పటి నుండి భారతదేశానికి 2024 నాటికి వివిధ సమయాలలో 15 మంది అధ్యక్షులు పనిచేసారు.[4] ఈ పదిహేను మందితో పాటు ముగ్గురు యాక్టింగ్ ప్రెసిడెంట్లు కూడా తక్కువ కాలం పదవిలో ఉన్నారు.
1969లో జాకీర్ హుస్సేన్ మరణించిన తర్వాత వరాహగిరి వెంకట గిరి తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. కొన్ని నెలల తర్వాత వి.వి. గిరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా, తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొొందాడు. మొదటి రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ రెండు పర్యాయాలు పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి. [5]
ఈ 15 మందిలో ఏడుగురు అధ్యక్షులు ఎన్నుకోబడక ముందు రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఆరుగురు భారత జాతీయ కాంగ్రెసు క్రియాశీల పార్టీ సభ్యులు.జనతాపార్టీకి నీలం సంజీవ రెడ్డి ఒక సభ్యుడుగా ఉన్నారు. ఆయన తర్వాత అధ్యక్షుడయ్యారు. ఇద్దరు రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్, ఫకృద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉండగానే మరణించారు.
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు వారి స్థానంలో ఉపాధ్యక్షులు తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. జాకీర్ హుస్సేన్ మరణం తరువాత, కొత్త అధ్యక్షుడు వరాహగిరి వెంకట గిరి ఎన్నికయ్యే వరకు ఇద్దరు తాత్కాలిక అధ్యక్షులు పదవీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనడానికి వి.వి. గిరి రాజీనామా చేసినప్పుడు,అతని తర్వాత ఎం. హిదయతుల్లా తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.[6]12వ రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ 2007 లో ఎన్నికైన మొదటి మహిళ.
2022 జులై 25 న, ద్రౌపది ముర్ము భారతదేశ 15వ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిని నిర్వహించిన రెండవ మహిళ, మొదటి గిరిజన వ్యక్తి. [7]