అరుణాచల్ ప్రదేశ్
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఒక రాష్ట్రం. భారతదేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఒక భాగమని చైనా వాదన. భారత, చైనాల మధ్య వివాదాస్పదంగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రం, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రం ఉత్తర సరిహద్దైన మెక్మెహన్ రేఖను గానీ అధికారికంగా గుర్తించలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించింది: (పశ్చిమం నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, ఝాయూ కౌంటీ. అయితే అదే సమయంలో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎటువంటి అందోళనలకు దారితీసే అవకాశం లేదని భావించారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అరుణాచల్ ప్రదేశ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఇటానగర్ - 27.08°N 93.4°E / 27.08; 93.4 |
పెద్ద నగరం | ఇటానగర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
1,091,117 (26) - 13/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
83,743 చ.కి.మీ (14) - 16 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[అరుణాచల్ ప్రదేశ్ |గవర్నరు - [[అరుణాచల్ ప్రదేశ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
20-02-1987 - బి డి మిశ్రా - పెమా ఖండూ - ఒకే సభ (60) |
అధికార బాష (లు) | ఇంగ్లీషు, ఆది, నిషి, మోన్పా |
పొడిపదం (ISO) | IN-AR |
వెబ్సైటు: arunachalpradesh.nic.in | |
అరుణాచల్ ప్రదేశ్ రాజముద్ర |
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలవబడుతున్న ఈ ప్రాంతం 1987 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైంది.[1]