మురారిరావు ఘోర్పడే
మరాఠా సైన్యాధికారి / From Wikipedia, the free encyclopedia
మురారిరావుగా పేరొందిన మురారిరావు ఘోర్పడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. భారతదేశంలో మొగలుల పాలన క్షీణదశకు చేరుకొని దక్షిణాపథంలో మరాఠులు విస్తరిస్తుంటే, మరో ప్రక్క ఫ్రెంచ్, బ్రిటిషు సేనలు ఉపఖండంలో పట్టుసాధించడానికి కృషి చేస్తూండేవారు. మరాఠులు, నిజాంలు, మైసూరు రాజ్యం, ఆధిపత్యంకై పోరాడుతూండేవారు. అలాంటి సంక్లిష్టమైన సమయంలో, దక్కన్లో పీష్వాలకు నమ్మకమైన సేనానిగా ఉన్న మురారిరావుకు 18వ శతాబ్దపు దక్షిణాపథ చరిత్రలో కీలకమైన స్థానమున్నది.[1] మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి సాహసోపేతమైన రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.[1]
మురారిరావు ఘోర్పడే | |
---|---|
జననం | 1699 గుత్తి |
మరణం | 1779 (aged 79–80) |
రాజభక్తి | మరాఠా |
సేవలు/శాఖ | సైన్యం |
ర్యాంకు | సైన్యాధిపతి & ఆ తరువాత సందూరు రాజా |