హిందు మహాసభ
From Wikipedia, the free encyclopedia
హిందు మహాసభ 1914 సంవత్సరములో స్థాపించబడింది. భారతదేశములో హిందుమత పరంపరాగతను సంరక్షించుట ముఖ్య లక్ష్యము కలిగియుండిన సంస్థ. 1909 సంవత్సరంలో అమలుచేయబడిన రాజ్యాంగ చట్ట ఫలస్వరూపముగా బ్రిటిష్ ప్రభుత్వము వారు ముస్లిం లీగు వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నందున ఆ సంస్ధకు పోటిగానుండుటకు నెలకొల్పబడింది. తదుపరి బ్రిటిష్ ఇండియా చరిత్రలో స్వతంత్రపోరాటముకొరకు 20 వశతాబ్దారంభమునుండి జోరుగా జరుగుచున రాజకీయాందోళన కాలమందు రాజకీయపార్టిగా కూడా అవతరించిన సంస్థ. రాజకీయ పార్టీగా ఎక్కువ ఆధిక్యత కలిగియుండకపోయినప్పటికిని జాతిమత ధర్మ విషయములలో హిందవుల హితముకోరిన సంస్థగా ప్రాముఖ్యతగైకొనియుండి జాతీయ కాంగ్రెస్సు పార్టీవారి మహాసభలలో చేయు తీర్మానములసైతము సమీక్షించి పరివర్తనచేయకలిగే స్తోమతకలిగియన్నట్టి ప్రముఖ సంస్థ. మహావీర దళమనెడి ఉపసంస్థ హిందు మహాసభవారి శాఖ. చిరకాలమునుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనుండి అనేక సార్లు కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్ష్యునిగా నుండి అనేక విద్యాసంస్థలను స్థాపించిన పండిత మదన్ మోహన్ మాలవ్యా గారు కాంగ్రెస్ వదలి హిందు మహాసభకు వ్యవస్థాపకుడై 1922 సంవత్సరమున ఆ సభకు అధ్యక్షుని గానుండెను. "హిందు రాష్ట్ర" ( హిందు దేశము) అను మరాఠీ భాషలోని హిందు మహాసభవారి వారపత్రిక పూనా (పునే Pune) పట్టణమునుండి ప్రచురించబడేది. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే ఆ వారపత్రికకు 1948 లో సంపాదకుడుగా నుండెను.[1]